సర్పంచ్ ను సన్మానించిన గ్రామస్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా :జాతీయ ఉత్తమ సామాజిక సేవా కార్యకర్త గా ఈ నెల 31 న ఢిల్లీలో అవార్డు అందుకోనున్న ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్, సామాజిక కార్యకర్త, నేవూరి వెంకట్ రెడ్డి ( Nevuri Venkat Reddy )నీ ఎల్లారెడ్డి పేట కు చెందిన వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

తమ గ్రామ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి జాతీయ స్థాయి ఉత్తమ సేవా కార్యకర్త అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్నీ జాతీయ స్థాయి ఆవార్డులు అందుకోవాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.గ్రామానికి కాక మండలాలకు వివిధ గ్రామాలకు నిరుపేదలకు సేవలు అందిస్తున్నటువంటి వెంకట్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు.

ఈ సన్మాన కార్యక్రమం లో గ్రామంలో గల అన్ని కుల సంఘాల సభ్యులు, యూత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News