తాలిబాన్ లకు వ్యతిరేకంగా లైవ్ లో సర్టిఫికెట్ చింపేసిన ప్రొఫెసర్..!!

ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తాలిబాన్ సామ్రాజ్యం నెలకొన్న సంగతి తెలిసిందే.

దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన తాలిబాన్ లు తీసుకొస్తున్న చట్టాలు సంచలనంగా మారుతున్నాయి.

ఈ చట్టాలు అతి భయంకరం కావడంతో.చాలామంది దేశం విడిచి పారిపోయారు.

ఇదిలా ఉంటే ఆడవాళ్ళపై కఠిన ఆంక్షలు విధిస్తూ చదువుకు దూరం చేయటంతో పాటు ఉద్యోగం కూడా చేయకూడదని తాలిబాన్ లు  వ్యవహరిస్తున్న తీరుపై ఓ ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో సీరియస్ అయ్యారు.కాబుల్ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లైవ్ డిబేట్ కార్యక్రమంలో తన డిగ్రీ పట్టా సర్టిఫికెట్ చింపేశారు.

"నాకు డిగ్రీలు అవసరం లేదు.నా తల్లులు, సోదరీమణులు చదవలేకపోతే.

Advertisement

ఈ విద్యను నేను అంగీకరించను.అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

 గతంలో కూడా ఇదే రీతిలో ఆడవాళ్లపై తాలిబాన్ లు కఠిన చట్టాలు తీసుకొచ్చారు.అయితే ఆ తర్వాత ప్రజాస్వామ్యం పరంగా ప్రభుత్వం ఏర్పడటంతో.

ఆడవాళ్లు యధావిధిగా ఉన్నత చదువులు చదువుతూ మరోపక్క ఉద్యోగం చేసుకోవడం జరిగింది.కానీ ఇప్పుడు మళ్లీ తాలిబాన్ లు దేశాన్ని పరిపాలిస్తూ ఉండటంతో ఆడవాళ్ళపై విధిస్తున్న ఆంక్షలు సంచలనంగా మారాయి.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు