లోకేష్ మెప్పించారు .. కార్యకర్తల్లో జోష్ పెంచేశారు !?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్రేజ్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో బాగా పెరిగినట్టు కనిపిస్తోంది.

గతంతో పోలిస్తే లోకేష్ పనితీరు మెరుగు పడడం తో పాటు, పార్టీ కేడర్ లోనూ ఆయనపై నమ్మకం బాగా పెరిగింది.

చంద్రబాబు ఏ విధంగా అయితే లొకేష్ ను బాగా ప్రమోట్ చేసి,  తన తర్వాత ఆ స్థాయి నాయకుడిగా లోకేష్ ను చూపించాలి అన్నట్టుగా గట్టి ప్రయత్నాలే చేశారు.ప్రస్తుతం ఆ విషయంలో సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా లోకేష్ పనిచేసిన సమయంలో పార్టీలో తనదైన శైలిలో ముద్ర వేసుకునేందుకు ప్రయత్నించారు.  కానీ ఆ సమయంలో లోకేష్ వ్యవహారం సొంత పార్టీ నాయకులకు తీవ్ర అసహనం కలిగించడంతో పాటు,  చాలామంది బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే ప్రస్తుతం టిడిపి ప్రతిపక్షంలో ఉండడంతో పూర్తిగా లోకేష్ పార్టీ కోసమే సమయమంతా కేటాయిస్తున్నారు.కిందిస్థాయి కార్యకర్తల సమస్యలను తెలుసుకున్నారు.

Advertisement

పరామర్శ పేరుతో యాత్రలు చేపడుతున్నారు ఈ విధంగా పార్టీ కేడర్ లో నమ్మకం పెంచుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు.  అదే సమయంలో లోకేష్ పై పార్టీలో నమ్మకం పెరిగింది.

దానికి ప్రస్తుతం ఆయన పుట్టిన రోజు ఉదాహరణగా తీసుకోవచ్చు.ప్రస్తుతం లోకేష్ కరోనా కారణంగా హోమ్ క్వరంటైన్ లో ఉంటున్నారు .అయినా పార్టీ శ్రేణులు మాత్రం పుట్టిన రోజుని ఎక్కడికక్కడ ఘనంగా నిర్వహిస్తున్నాయి.పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతూ , తమ ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

లోకేష్ సైతం మాస్ లుక్ తో కనబడుతూ, మాస్ ఫాలోయింగ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో పాటు,  వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలను హైలెట్ చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్న తీరు పార్టీ నాయకుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. .

ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 
Advertisement

తాజా వార్తలు