హోటల్ యజమాని కత్తితో పొడిచి హత్యాయత్నం చేసిన నిందితులు అరెస్ట్

నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda ) బైపాస్ రోడ్డు లోని ఉషారాణి హోటల్ కి శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణానికి చెందిన నలుగురు వ్యక్తులు సుమారు 4:30 గంటల సమయంలో మద్యం సేవించి పరోటా తినడానికి వెళ్ళారు.

ఇప్పుడే హోటల్ ఓపెన్ చేశామని,కొంచెం టైం పడుతుందని చెప్పడంతో వారితో గొడవపడి హోటల్ యజమాని వెంకటేశ్వరరావు@ వెంకన్నపై కూరగాయలు కోసే కత్తితో హత్యాయత్నం చేయగా తలపైన పగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

బాధితుని ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ నాగార్జున(CI Nagarjuna ) కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి,ఆ నలుగురు నిందితులలో నాగెళ్ళ సురేష్, ఇలుగు ఏడుకొండలు,దామర రాంబాబు అనే ముగ్గురిని శనివారం అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్ కు తరలించారు.కేసు నమోదైన 24 గంటల లోపల నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించడంలో చొరవ చూపిన ఎస్ఐలు రాంబాబు,కృష్ణయ్య, మరియు కానిస్టేబుల్స్ పి.బాలకృష్ణ, కె.కళ్యాణ్,ఎం.రామకృష్ణ, ఎస్కే.

అక్బర్ లను సిఐ అభినందించారు.

వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
Advertisement

Latest Nalgonda News