పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉద్రిక్తత

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పొలం పాస్ బుక్ లలో సీఎం జగన్ ఫొటో ముద్రించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కలెక్టరేట్ కు రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు.రంగంలోకి దిగిన పోలీసులు సోము వీర్రాజును అడ్డుకునే ప్రయత్నం చేశారు.

దీంతో బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగింది.ఈ సందర్భంగా ప్రభుత్వం చర్యలపై సోమువీర్రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దీంతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Advertisement
మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 

తాజా వార్తలు