తెలంగాణలో మళ్లీ పుట్టిన గాంధీ.. భజన ప్రారంభించిన నాయకుడు.. !?

మన భారతదేశాన్ని బానిస సంకెళ్ల నుండి విముక్తి చేసిన వారిలో మహత్మ గాంధీ పేరు ముఖ్యంగా వినిపిస్తుంది.

అయితే ప్రస్తుతం తెలంగాణాలో మాత్రం తెలంగాణ బానిస సంకెళ్లు తెంపివేసింది మాత్రం కేసీఆర్ అని అనడం విడ్డూరంగా ఉందని కామన్ పీపుల్ అనుకుంటున్నారట.

ఇంతకు విషయం ఏంటంటే.తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేసీఆర్ పై ఉన్న తన అభిమానాన్ని చాటుకున్నారట.

తెలంగాణకు స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్ముడు, తెలంగాణ గాంధీ కేసీఆర్ అని గులాభి బాస్‌ను ఆకాశానికెత్తేస్తూ తెగ కొనియాడుతున్నాడట.

భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి బ్రిటీష్ వాళ్లతో మహాత్మాగాంధీ పోరాడితే, తెలంగాణకోసం కేసీఆర్ ఉద్యమం చేసి సాధించాడని అందుకే కార్పొరేషన్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ నిలువెత్తు విగ్రహాన్ని పెట్టాలని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారట.ఇక ఈ విషయం విన్న వారికి నవ్వు ఆగడం లేదని ప్రచారం.అసలు భారతదేశాన్ని బానిసత్వం నుండి విముక్తి ప్రసాధించడానికి గాంధీజీ త్యాగం ముందు, కేసీయార్ చేసిన త్యాగం ఆవగింజంత కూడా కాదు.

Advertisement

ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చి కోట్ల ఆస్తులు కూడ బెట్టుకోలేదు.మీ పబ్బం గడుపు కోవడానికి చివరికి గాంధీ లాంటి మహాత్ముని పేరును ఎవరికి పడితే వారికి తగిలించడం సమంజసమా అని కడుపు మండుతున్న సామాన్యులు ప్రశ్నిస్తున్నారట.

గోల్డ్ మెడలిస్ట్ నదీమ్‌కు గిఫ్ట్‌గా బర్రె ఇచ్చాడు.. ఎవరో తెలిస్తే!
Advertisement

తాజా వార్తలు