అమరావతిని బతకనివ్వరా ? ఓ మీడియా ఛానెల్ పై బాబు ఆగ్రహం

మీడియా మేనేజ్మెంట్ లో దిట్టగా పేరున్న ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఓ టీవీ ఛానల్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని కోసం రైతులు ఆందోళన చేస్తుంటే వారిని పెయిడ్ ఆర్టిస్టులు, బిర్యానీ కోసం వచ్చారంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఓ టీవీ ఛానల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

మీ స్వార్ధం కోసం అమరావతిని బలి చేస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.అసలు అమరావతి ఇమేజ్ ను నాశనం చేసే హక్కు, అధికారం మీకు ఎవరు ఇచ్చారు అంటూ సదరు న్యూస్ ఛానల్ పై మండిపడ్డారు.

జగన్ మూడు రాజధానుల ప్రకటన చేయడంపై అమరావతి ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే రైతులు చేస్తున్న ఆందోళన వద్దకు వెళ్లిన సదరు మీడియా ఛానల్ ప్రతినిధి వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం, అక్కడ రైతులు ఆగ్రహంతో ఆమెపై దాడి చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

దీనిపై సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు.మీడియా ఛానల్ ప్రతినిధి పై దాడి చేయడం తగదని అన్యాయమని, దాడిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖండించకపోవడం దారుణం అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న సీపీఎం..!!

తాజా వార్తలు