అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.తిరుమలలో ఉద్యానవనాలను ఈవోతో కలిసి ఆయన ప్రారంభించారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రూ.60 లక్షలతో ఉద్యానవనం అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 27న స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.అదేవిధంగా నూతన పరకామణి భవనాన్ని కూడా ప్రారంభిస్తారన్న ఆయన.2023 నాటికి శ్రీనివాస సేతు వారధి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

తాజా వార్తలు