సలార్ సెట్ లో క్రాక్ బ్యూటీకి ప్రభాస్ విందు భోజనం అందిందా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ స్టార్ అయ్యాడు.

ప్రస్తుతం ఆయన రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.

ఆ సినిమా తర్వాత సలార్, ఆదిపురుష్ సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించి షూటింగ్ కూడా ఒకేసారి పూర్తి చేస్తున్నాడు.కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతుంది.

సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

Advertisement

తాజాగా శృతి హాసన్, ప్రభాస్ సలార్ సెట్ లో అడుగుపెట్టారు.అయితే ఇప్పుడు అభిమానుల మధ్య శృతి హాసన్ కు ప్రభాస్ విందు భోజనం తినపించాడా లేదా అనే చర్చ జరుగుతుంది.

ప్రభాస్ కు ఎక్కడ సినిమా చేస్తున్న తన కుక్ తో వంట చేయించుకుని తినడం అలవాటు.ఆయన తినడం మాత్రమే కాదు సెట్ లో ఉన్నవారికి కూడా ప్రభాస్ తన వంటకాలను రుచి చూపిస్తాడు.ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా సమయంలో పూజ హెగ్డే కి, సాహో సినిమా సమయంలో శ్రద్ధ కు తన విందు భోజనం తినిపించాడు.

అందుకే ఇప్పుడు సలార్ లో శృతి కి కూడా విందు భోజనం తినిపించాడా లేదా అని టాక్ నడుస్తుంది.అయితే ఈ విషయంపై తాజాగా శృతి హాసన్ స్పందించారు.

ప్రభాస్ నుండి ఇంతవరకు ఆతిధ్యం అందుకోలేదని అందుకు కారణం తాము ఇరువురం ప్రస్తుతం డైట్ లో ఉన్నామని శృతి తెలిపింది.ఈ సందర్భంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ప్రభాస్ సెట్ లో ఉండే చాలా ఎనర్జీగా ఉంటుందని.అంతేకాదు ఎంతో వినయవిధేయంగా ఉంటాడని ఆమె కంప్లిమెంట్ అందించింది.

Advertisement

తాజా వార్తలు