దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ రావాలని భగవంతున్ని వేడుకున్నారు.సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు ఎల్లపుడూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.

ఆయన వెంట ఏఐసిసి నాయకులు అజ్మతుల్ల హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి,గౌస్, అసరి బాలరాజ్ యాదవ్, వోరుగంటి తిరుపతి, ఎల్లారెడ్డి పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మట నరసయ్య, మానుక నాగరాజ్ యాదవ్,సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొనగా వేయి మంది కి అన్నదానం చేశారు.

ఓకే డ్రెస్ ను చాలాసార్లు రిపీటెడ్ గా ధరించిన సెలబ్రిటీస్ వీరే !
Advertisement

Latest Rajanna Sircilla News