కామాంధుడి టార్చర్ తాళలేక తనను తానే పొడుచుకున్న బాలిక.. వీడియో వైరల్..

మధ్యప్రదేశ్( Madhya Pradesh ) రాష్ట్రం, సిద్ధి జిల్లా, సెమరియా పట్టణంలో ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది.ఓ స్కూల్‌గర్ల్‌ ఇంటికి వస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ఓ కామాంధుడి వేధింపులను తట్టుకోలేక ఆ బాలిక రోడ్డుపైనే కత్తితో తన గొంతు కోసుకుంది.ఈ భయంకర దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆ బాలిక తన గొంతును పదే పదే కోసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఈ ఘటన జరిగిన వెంటనే ఆ బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించి, తర్వాత రేవా సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని స్థానిక మీడియా నివేదించింది.9వ తరగతి చదువుతున్న బాలికను సిరాజ్ అహ్మద్ అనే వ్యక్తి వేధించడంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందని చెబుతున్నారు.కోల్‌కతా( Kolkata )లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Advertisement

ఆ సమయంలోనే ఈ ఘటన జరగడం ప్రజలను కలచివేసింది.

సిరాజ్ అహ్మద్( Siraj Ahmed ) ఈ బాలికను రోజూ వేధిస్తున్నాడట.స్కూల్ వరకు ఆమెను వెంబడించేవాడని తోటి విద్యార్థులు చెప్పారు.ఈ వేధింపులకు తాళలేక ఆ బాలిక ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

ఈ బాలిక పాఠశాలలో పోస్ట్-లంచ్ క్లాసెస్ ఎగ్గొట్టి బయటకు వచ్చింది.సీసీటీవీ వీడియోలో తోటి విద్యార్థిని ఆమెను ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

బాలిక చాప నుంచి షూ మేకర్ సూదిని తీసుకొని చాలా వేగంగా మెడ మీద పొడిచుకోవడం కనిపించింది.ఈ షాకింగ్ అతను జరిగిన తర్వాత సిద్ధి పోలీసులు నిందితుడు సిరాజ్‌ అహ్మద్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

అర్హతలు ఉన్నా సాయిపల్లవికి దక్కని అవార్డ్.. మరీ ఇంత అన్యాయమా అంటూ?
సరస్సులో స్విమ్మింగ్ చేస్తూనే దోసకాయ సలాడ్ తయారీ.. వీడియో వైరల్..!

బాధితురాలి బంధువులు కూడా అతనిపై ఒక ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు కేసు ఫైల్ చేశారు.త్వరలోనే బాధితురాలి వాంగ్మూలం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు