అల్లు అర్జున్ టార్గెట్ తెలిసిపోయింది

అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి.సినిమా ఓ మోస్తారుగా ఆడినా , అల్లువారి అబ్బాయికి ఉపయోగపడింది ఏమిలేదు.

చాలా విమర్శలు వచ్చాయి బన్ని మీద.తదుపరి చిత్రం ఆర్యతో ఒక్కసారిగా అందరి నోళ్లు మూయించాడు బన్ని.దాని తరువాత వచ్చిన బన్ని , దేశముదురు చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకోని, యాక్షన్ హీరోగా నిలబడ్డాడు.

మధ్యలో తడబడ్డా , జులాయి తో వరుస పరాజయాలకు బ్రేక్ వేసుకున్నాడు.రేసుగుర్రం తో 50 కోట్ల మార్కుని అందుకున్నాడు.కెరీర్ బెస్ట్ ఫేస్ లో ఉన్న బన్నికి అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది.

అదే మాస్ ఫాలోయింగ్.మెగా హీరో, మంచి నటుడు, నెం.1 డ్యాన్సర్ .ఇది అల్లు అర్జున్ కి ఉన్న గుర్తింపు.కాని బి.సి సెంటర్లలో ప్రేక్షకులు బన్ని మీద మక్కువ చూపించట్లేదు.ఇప్పడున్న దర్శకులలో బోయపాటి శ్రీను కి ఉన్న మాస్ అపీల్ అదో రకం.అందుకే బోయపాటి ద్వారా మాస్ ఫాలోయింగ్ రాబట్టుకోవాలనేది బన్ని ప్లాన్.దిన్ని దృష్టిలో పెట్టుకోనే సరైనోడు కోసం అదోరకం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు.

Advertisement

ఇటివలే చిత్రీకరించిన ఇంటర్వెల్ ఎపిసోడ్ కి బ,సి సెంటర్లలో జాతర ఖాయమని చెబుతున్నారు చూసినవారు.ఎప్రిల్ 8 వ తేదిన సరైనోడు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు