మీడియాపై సమంత సెటైరికల్ పోస్ట్..!

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఈమధ్య సోషల్ మీడియాలో అవసరం అయితేనే టచ్ లో ఉంటుంది.

ఈమధ్య తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పేరుని ఎస్ గా మార్చి షాక్ ఇచ్చిన సమంత ఆ విషయంపై మీడియా చేస్తున్న హడావిడితో విసిగిపోయినట్టు కనిపిస్తుంది.

అందుకే లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో మీడియా, రియాలిటీ అంటూ ఒక ఫోటోతో మీడియాపై సెటైర్ వేసింది అక్కినేని కోడలు.మీడియా అంటూ చూపించిన పెట్ డాగ్ భయంకరంగా పళ్లన్ని బయటపెట్టి ఉంది.

ఇక రియాలిటీలో అదే పెట్ డాగ్ మరో పెట్ డాగ్ ఓ సైలెంట్ గా కనిపించింది.ఇది చూస్తే తన పర్సనల్ విషయాల మీద మీడియా చేస్తున్న న్యూసెన్స్ మీదనే సమంత ఇలా రియాక్ట్ అయ్యి ఉండొచ్చని అంటున్నారు.సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మీడియాపై ఇంత డైరెక్ట్ గా సమంత చెప్పడం కొన్ని మీడియా వర్గాలు తప్పుపడుతున్నాయి.సమంత పర్సనల్ లైఫ్ లో జరుగుతున్న విషయాల మీద మీడియా ఈమధ్య స్పెషల్ ఫోకస్ చేయడం.

Advertisement

అసలు విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయడం వల్లే సమంత ఇలా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చని అనుకుంటున్నారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement

తాజా వార్తలు