ఆ జీవో రద్దు చేయాలని టీడీపీ మాజీ మంత్రి డిమాండ్..!!

రాష్ట్రంలో మత్స్యకారుల విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 217 నీ రద్దు చేయాలని టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో ఆ జీవో కి సంబంధించిన ప్రతులను తగలబెట్టారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర.వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన 217 వ జీవో రాష్ట్రంలో మత్స్యకారుల పొట్ట కొట్టడానికి అంటూ ధ్వజమెత్తారు.

జగన్ ప్రభుత్వం కావాలని మత్స్యకారులను నిలువునా నట్టేట ముంచుతున్నారు అని మండిపడ్డారు.ఈ జీవో వల్ల మత్స్యకార సొసైటీ హక్కులను ప్రభుత్వం కాల రాస్తున్నట్లు ఉందని ఆరోపణలు చేశారు.

అంతమాత్రమే కాకుండా చెరువులకు ఆన్ లైన్ లో.టెండర్ ప్రక్రియ అనేది మత్స్యకారులనీ మోసం చేయటం విధానమే అని సీరియస్ అయ్యారు.ఈ విషయంలో వైసీపీ మంత్రి అప్పలరాజు తన పదవిని కాపాడుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులకు అన్యాయం.

Advertisement

జరుగుతున్న గాని నోరు మెదపడం లేదని.కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

మత్స్యకారుల విషయంలో జీవో 217.వైసిపి ప్రభుత్వం రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మత్స్యకారులతో చేస్తామని మాజీమంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు