పవన్‌ కోసం ఎదురు చూస్తున్న ఆ ఇద్దరు..!

పవన్ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మొత్తం ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.

వకీల్‌ సాబ్‌ తర్వాత అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ ను పవన్‌ చేస్తున్నాడు.సాగర్ చంద్ర దర్శకత్వంలో నాగ వంశీ ఆ సినిమా ను నిర్మిస్తున్నాడు.రీమేక్‌ లో పవన్ తో పాటు రానా కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.

వీరిద్దరి కాంబో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇక మరో వైపు క్రిష్‌ దర్శకత్వం లో హరి హర వీరమల్లు సినిమా ను కూడా పవన్‌ చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ను ఈ ఏడాది లో పూర్తి చేయాలని క్రిష్‌ భావిస్తున్నాడు.కాని ఇప్పటి వరకు సినిమా షూటింగ్ విషయంలో క్రిష్ క్లారిటీ గా లేడు.

ఒకే షెడ్యూల్‌ ను మాత్రమే పూర్తి చేసిన హరి హర వీరమల్లు చిత్ర యూనిట్‌ సభ్యులు రెండవ షెడ్యూల్‌ కోసం గత నెల నుండే ఎదురు చూస్తున్నారు.పవన్‌ రాక కోసం క్రిష్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా ఎదురు చూస్తున్న ఈ సమయంలో పవన్‌ కరోనా నుండి కోలుకున్నా మరి కొంత కాలం విశ్రాంతి అవసరం అంటూ టాక్ వినిపిస్తుంది.అందుకే క్రిష్‌ త్వరలోనే మళ్లీ షూటింగ్ లో జాయిన్‌ అయ్యే అవకాశాలు అంటూ వచ్చిన వార్తలు నిజం కాదని తేలపోయింది.

పవన్‌ కళ్యాణ్‌ కనీసం నెలన్నర రోజుల పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి.అంటే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ కు మరో రెండు మూడు నెలల సమయం అయినా పట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పవన్‌ షూటింగ్‌ లో ఎప్పుడెప్పుడు జాయిన్‌ అవుతాడా అంటూ సాగర్‌ చంద్రతో పాటు క్రిష్‌ కూడా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.వీరిద్దరు మాత్రమే కాకుండా హరీష్‌ శంకర్ దర్శకత్వం లో కూడా పవన్ సినిమా ఉంది.

అది ఈ ఏడాది లోనే ఆరంభం అవ్వాల్సినా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

తాజా వార్తలు