రోజా కూతురు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ... ఆ బ్యానర్ లో

టాలీవుడ్ లో సెలబ్రిటీ కుటుంబాల నుంచి హీరోలు వారసులుగా వస్తూ ఉంటారు కాని హీరోయిన్స్ రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబు కూతురు నిహారికా మొదటి సారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఆమెని స్పూర్తిగా తీసుకొని రాజశేఖర్ కూతుళ్ళు ఇద్దరు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు.అయితే వీరి కంటే ముందుగా మోహన్ బాబు కూతురు లక్ష్మీ ప్రసన్న నటిగా తెరంగేట్రం చేసింది.

అలాగే ఒకప్పటి తెలుగు నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా సౌత్ లో కొనసాగుతుంది.అలాగే అర్జున్ కూతురు కూడా హీరోయిన్ అయ్యింది.

శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.ఇలా చాలా మంది సెలబ్రిటీ వారసులు హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సౌత్ లో రాణిస్తున్నారు.

Advertisement

ఇప్పుడు వీళ్ళ దారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వమణి కూతురు అన్షు మాలిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందని టాక్ వినిపిస్తుంది.రోజాకి ఎలాగూ ఇండస్ట్రీలో మంచి పరిచయాలు ఉన్నాయి.

అలాగే రోజా భర్త కూడా కోలీవుడ్ లో మంచి దర్శకుడు.ఇప్పుడు వీరిద్దరి కూతురు హీరోయిన్ గా ఎంట్రీ అంటే కచ్చితంగా గ్రాండ్ వెల్ కమ్ దొరుకుతుంది.

అయితే ముందుగా తన కూతురుని టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం చేయాలని రోజా భావిస్తున్నట్లు బోగట్టా.దిల్ రాజు బ్యానర్ ద్వారా అయితే మంచి ఎంట్రీ అవుతుందని భావించి అన్షుని హీరోయిన్ గా పరిచయం చేసే బాద్యతని అతనికి అప్పగించినట్లు టాక్ నడుస్తుంది.

అలాగే గతంలో రోజాతో సినిమా చేసిన డైరెక్టర్ చేతుల మీదుగా అన్షు మాలిక ఎంట్రీ ఉండబోతుందని మాట ఇప్పుడు బలంగా వినిపిస్తుంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు