రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ కు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతూ సిరిసిల్ల ఆర్ టి సి డిపో మేనేజర్ మనోహర్ కు సిరిసిల్ల ఆర్ టి సి డిపో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఎల్లారెడ్డి పేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చదవడానికి తిమ్మాపూర్, పదిర, వెంకటాపూర్ , వీర్నపల్లి మండలాల నుంచి ఇంటర్ చదవడానికి వస్తున్నారని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆర్ టి సి బస్ లలో వచ్చి బస్ స్టాండ్ లో దిగి మళ్ళీ కళాశాలకు రావాలంటే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనీ మేనేజర్ దృష్టికి తీసుకు వెళ్ళారు.

అదే విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయని అందులో పనిచేసే సిబ్బందికి కూడా ఇక్కడ రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే సౌలభ్యం గా ఉంటుందని డిపో మేనేజర్ కు తెలిపారు.వీలైనంత త్వరలో రిక్వెస్ట్ స్టాఫ్ ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారు.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News