పిల్లల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న రేణు దేశాయ్!

బద్రి సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణుదేశాయ్ తరువాత పవన్ కళ్యాణ్ వివాహం చేసుకుని తన జీవితంలో స్థిరపడ్డారు.

తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాతగా, దర్శకునిగా తెరకెక్కిన జానీ సినిమా లో రేణు దేశాయ్ నటించారు ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

దాంతో సినిమాలకు దూరంగా ఉంటున్న రేణుదేశాయ్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా, రచయితగా పనిచేస్తూ తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.దాదాపు పదకొండు సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా సాగిన వీరి వైవాహిక జీవితంలో రేణు దేశాయ్ కి అఖిరా నందన్, ఆద్య అనే పిల్లలు ఉన్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకుని విడిపోయిన రేణు దేశాయ్, ప్రస్తుతం తన ఇద్దరు పిల్లల బాధ్యతను తానే తీసుకొని వారికి తండ్రి లోటు తెలియకుండా పెంచుతున్నారు.తాజాగా సుమ నిర్వహిస్తున్న ఒక షోలో పాల్గొన్న రేణు దేశాయ్ తమ పిల్లల గురించి మాట్లాడుతూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.

ప్రముఖ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న "సుమక్క" అనే యూట్యూబ్ ఛానల్లో ప్రసారమవుతున్న షో లో రేణు దేశాయ్ పాల్గొన్నారు.అయితే తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.ఈ షో లో సుమ_రేణు దేశాయ్ ల మధ్య సరదా సన్నివేశాలు సాగాయి.

Advertisement

ఈ షోలో భాగంగానే తన పిల్లలు అకీరా, ఆధ్య గురించి మాట్లాడుతూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు.తన పిల్లలు ఎక్కడికైనా పవన్ షూటింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తనకు ఫోన్ వచ్చేదని ఆమె తెలిపారు.

అక్కడి వారు మీ పిల్లలు ఎంతో సరదాగా అందరితో కలిసిపోతున్నారని చెప్పినప్పుడు ఎంతో ఆనందం వేసేదని తెలుపుతూ ఆమె కొంత ఉద్వేగానికి లోనయ్యారు.ఈ షోలో పాల్గొన్నందుకు గాను సుమ "బెస్ట్ మామ్ఎవర్"అంటూ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటో ఒక టీ కప్పు పై ముద్రించి రేణుదేశాయ్ కి గిఫ్ట్ గా అందించారు.

అయితే రేణుదేశాయ్ పాల్గొన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు