అఖండ ఆలస్యానికి అదే కారణమా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చాలా రోజుల తరువాత బాలయ్య సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి వారిలో నెలకొంది.

ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ముఖ్యంగా బాలయ్యతో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాలు అదిరిపోయే హిట్లుగా నిలవడంతో ఈసారి వీరిద్దరి కాంబో హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.

అయితే అఖండ చిత్రం ఎప్పుడో పూర్తయి రిలీజ్ కూడా కావాల్సింది.కానీ కరోనా కారణంగా ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

దీంతో ఈ సినిమా రిలీజ్ కూడా ఆలస్యం అవుతూ వచ్చింది.అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తూ వస్తోంది.

Advertisement

కానీ ఇప్పుడు ఇది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాను దసరా రేసులో రిలీజ్ చేయాలని చూసినా, ఏపీలో నెలకొన్ని టికెట్ వివాదం కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని చిత్ర యూనిట్ చూస్తోందట.

ఏపీలోని థియేటర్ల టికెట్ ధరల వివాదం ముగిశాక అఖండ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.అయితే దసరా లోపే ఈ వివాదం ముగిసే అవాకశం ఉండటం, దసరా బరిలో పలు చిత్రాలు పోటీ పడుతుండటంతో అఖండ చిత్రం సోలోగా బరిలో దిగేందుకు రెడీ అవుతోంది.

ఈ క్రమంలో దసరా తరువాత అఖండ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా, ఆయన సరసన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు