కొడుకు ఫోటో షేర్ చేస్తూ కన్నీళ్లు పెట్టిన రజినీకాంత్ కూతురు.. కారణమిదే!

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండవ కుమార్తె అయిన సౌందర్య రజనీకాంత్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

సౌందర్య రజనీకాంత్ తాను తల్లి అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ తన చిన్నారికి వీర్ రజినీకాంత్ వనంగమూడి అనే పేరును కూడా పెట్టినట్లు తెలిపింది.

ఇటీవల ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.ఆ పోస్టులో ఆమె తన చిన్నారితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది.

అంతేకాకుండా ఆమె మెడలో పూల దండ వేసుకోగా ఆమె వెనకాలే రజినీకాంత్ నిలబడి ఉన్నారు.ఇక సౌందర్య రజనీకాంత్ ఆ పోస్టులో తన తండ్రిని ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ సంవత్సరం దేవుడు నన్ను ఉత్తమమైన బహుమతితో దీవించాడు.

Advertisement

అది నా పాప వీర్‌.అలాగే ఆ దేవుడు ఇచ్చిన మరో అద్భుతమైన వరం ఎప్పుడూ నా వెనకాల ఉంటుంది.

ఆయనే నా ధైర్యం, బలం, ఆశీర్వాదం అంటూ సౌందర్య ఎమోషనల్‌ గా రాసుకొచ్చింది సౌందర్య రజనీకాంత్.

ఇకపోతే 2017 లో ఆమె అశ్విన్ రాంకుమార్ నుంచి విడాకులు తీసుకుని వెళ్లిపోయి అనంతరం 2019లో నటుడు వ్యాపారవేత్త అయినా విషగన్‌ వనంగమూడిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.కాగా వీరిద్దరికీ తొలి సంతానంగా వీర్ జన్మించింది.ఆమె తన తండ్రితో కలిసి కోలీవుడ్ లో నిర్మాతగా, దర్శకురాలిగా బాధ్యతలు కూడా చేపడుతోంది.

కాగా సౌందర్య రజినీకాంత్ రెండవ భర్త నటుడు అన్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు