ఆంధ్రప్రదేశ్ లో పెదలందరికీ ఇల్లు కింద జరుగుతున్న పనుల పురోగతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి హౌసింగ్ శాఖతో సమీక్షా సమావేశం నిర్వహించారు.అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కోటి రూపాయిల విలువైన పనులు పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.అయితే దాదాపు రూ.4,318 కోట్లు రెండు దశల్లో మొత్తం రూ.21.55 లక్షల ఇళ్లను చేపట్టనున్నారని వారు చెబుతున్నారు.ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి జగన్ కి చెబుతున్నారు.వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రతి వారం ఇళ్ల నిర్మాణాలు చేపడతామని, అక్టోబర్ నుంచి వారానికి 70 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
అయితే ఇండ్ల నిర్మాణం పూర్తి కాగానే జగనన్న కాలనీల్లో కనీస వసతులైన డ్రైనేజీ, కరెంటు, తాగునీరు అందేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్ శాఖ అధికారులకు పునరుద్ఘాటించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని సిరియస్ గా అధికారుకు ఆయన సూచించారు.జగనన్న కాలనీల పరంగా ప్రాధాన్యత ఉన్న పనులపై స్పష్టమైన ప్రణాళికతో రండి అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటున్నారు.
![Telugu Agency Areas, Ap, Cm Jagan, Gajanan Colony, Poor Pepole, Tidco Houses-Pol Telugu Agency Areas, Ap, Cm Jagan, Gajanan Colony, Poor Pepole, Tidco Houses-Pol](https://telugustop.com/wp-content/uploads/2022/09/poor-pepole-ycp-ap-govt-agency-areas-gajanan-colony.jpg )
ఆంధ్రప్రదేశ్ టిడ్కో హౌసింగ్ను మరింత సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టిడ్కో గృహాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు.టిడ్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని, డిసెంబర్లోగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని హౌసింగ్ శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వివరించారు.అయితే కనీస మౌలిక సదుపాయాల ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని సిరియస్ గా అధికారుకు ఆయన సూచించారు.