ప్రభాస్ అలా చేస్తున్నాడు అందుకే రాధేశ్యామ్‌ నాకు చాలా స్పెషల్.. పూజా హెగ్డే!

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

అలా వైకుంఠపురంలో సినిమాతో మంచి క్రేజ్ అందుకోవడంతో బాగా అవకాశాలు అందుకుంటుంది.

టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది.పైగా స్పెషల్ సాంగ్ లో కూడా బాగా మెప్పించింది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరో రామ్ చరణ్ సరసన నటిస్తుంది.

ఇక అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ప్రభాస్ నటిస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో కూడా నటిస్తుంది పూజ.ఇక ఈ సినిమాకు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.

Advertisement

మరో పది రోజులలో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తాజాగా పూజా హెగ్డే తెలిపింది.

ఇక ఇందులో పూజ ప్రేరణ అనే పాత్రలో నటిస్తుండగా.ఈ పాత్ర గురించి సినిమా విడుదల సమయంలో తెలుపుతానని తెలిపింది.ఇక ఈ మధ్యకాలంలో తను చేస్తున్న సినిమాలలో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఉన్న ప్రేమ కథ చిత్రం అని తెలిపింది.

ఇక ఎన్నో యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ కూడా రొమాంటిక్ మూవీ చేస్తున్నాడని.అందుకే తనకు ఈ సినిమా స్పెషల్ అని తెలిపింది పూజా హెగ్డే.

ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దీవాలి, రణ్ వీర్ సింగ్ నటిస్తున్న సర్కస్ సినిమాలో వరుసగా నటిస్తుంది.తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.మొత్తానికి ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు