జులై లో లైగర్ తో రావడానికి కి ఫిక్స్ అయిన పూరీ, రౌడీ స్టార్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని తనకు అలవాటైన మాఫియా బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాతో తెరకేక్కిస్తున్నాడు.

ఈ సినిమా యాభై షూటింగ్ లాక్ డౌన్ కి ముందే పూర్తయ్యింది.కరణ్ జోహార్, చార్మ్ సంయుక్తంగా విజయ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

పవర్ ఫుల్ కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో విజయ్ కిజోడీగా అనన్యా పాండే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ రీసెంట్ గా రిలీజ్ చేసింది.

సినిమాకి లైగర్ అనే టైటిల్ ఫిక్స్ చేసింది.ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా తాజాగా స్టార్ట్ అయ్యింది.

Advertisement

ముంబైలో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లు హీరో విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు.ఇదిలా ఉంటే పూరీ కెరియర్ లో ఎక్కువ కాలం షూటింగ్ జరుపుకుంటున్న మొదటి చిత్ర ఇదే అని చెప్పాలి.

పూరి జగన్నాథ్ సినిమా అంటే మేగ్జిమం మూడు నెలలకి మించి ఉండదు.అలాంటిది లైగర్ కోసం సుదీర్ఘ సమయం తీసుకున్నాడు.

ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్న లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడిపోయింది.ఇదిలా ఉంటె ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడంతో పాటు సినిమా రిలీజ్ కి కూడా పూరీ టైం ఫిక్స్ చేసేశాడు.

జులై నాటికి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నారు.ప్రస్తుతానికి అయితే డేట్ ఫిక్స్ చేయకున్నా జులైలో ప్రేక్షకుల ముందుకి వచ్చేది పక్కా అని చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు