కరోనా కారణంగా తిండిలేక అల్లాడుతున్న హీరో

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి.ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.

దీంతో ఈ మహమ్మారిని నివారించేందుకు పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.అయితే ఈ లాక్‌డౌన్ కారణంగా అనేక రంగాలు మూతపడ్డాయి.

కాగా ఈ లాక్‌డౌన్ కారణంగా పలువురు భారతీయులు ఇతరదేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు.ఈ జాబితాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా ఉన్నారు.

ఓ మలయాళ చిత్రం షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ జోర్దాన్ దేశంలోని ఓ ఎడారి ప్రాంతానికి వెళ్లారు.అయితే అక్కడ లాక్‌డౌన్ విధించడంతో చిత్ర యూనిట్ ఎడారిలోనే చిక్కుకుపోయింది.

Advertisement

వారు అక్కడ తినడానికి తిండి కూడా లేక నానా తంటాలు పడుతున్నారు.దీంతో తమను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని వారు కోరుతున్నారు.

ఈ క్రమంలో మలయాళ సినీ పరిశ్రమ ఆ చిత్ర యూనిట్‌ను తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.కాగా ఇదే విధంగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు భార్యా పిల్లలు కూడా అమెరికాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు