ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి...సుశాంత్ కుమార్

ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్( Sushant Kumar ).

రాజన్న సిరిసిల్ల జిల్లా :కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంను( Jan Dhan Yojana Scheme ),ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్ కోరారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో, వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో, మంగళవారం ప్రధానమంత్రి జనధన్ యోజన పథకం క్రింద ఖాతాలు తెరిచేందుకు గాను ప్రత్యేక క్యాంపు నిర్వహించారు.

ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వేములవాడ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు, క్యాషియర్శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

పత్తి కొనుగోలుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
Advertisement

Latest Rajanna Sircilla News