ఆదిపురుష్‌ పై రూ.150 కోట్ల అదనపు భారం.. అంత సాధ్యమయ్యేనా?

ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్‌ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల సినిమా కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మళ్లీ జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ మళ్లీ చేస్తున్న కారణంగా నిర్మాతలపై ఏకంగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా పడుతోందని తెలుస్తోంది.ఇప్పటికే సినిమా బడ్జెట్ భారీగా పెరిగింది.

అయినా కూడా 150 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయడం అనేది కచ్చితంగా సినిమా పై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.సినిమా టీజర్ విడుదలైన సమయం లో చిన్న పిల్లల సినిమా అన్నట్లుగా ఉంది అంటూ గ్రాఫిక్స్ పై కొందరు విమర్శలు గుప్పించారు.

అందుకే చిత్ర యూనిట్ సభ్యులు మరో సారి గ్రాఫిక్స్ వర్క్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.ఈ జూన్ నెలలో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమా లో ప్రభాస్ ని రాముడి పాత్ర లో చూడబోతున్నాం, ఆయనకు జోడిగా కృతి సనన్‌ నటించింది.ఆమె సీతా దేవి పాత్రలో కనిపించబోతుంది.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని రావణాసుర పాత్రలో చూడబోతున్నాం.

మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.కానీ ఆలస్యం అవుతున్నా కొద్ది సినిమా పై అపనమ్మకం ఏర్పడుతుంది.

ప్రేక్షకులకు నమ్మకం కలిగించే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.ఆ దిశగా యూనిట్ సభ్యులు ఎంత వరకు సఫలమవుతారు అనేది చూడాలి.

బడ్జెట్ భారీగా పెరిగింది కనుక ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహించాల్సి ఉంటుంది.ప్రమోషన్‌ కార్యక్రమాలపై దృష్టి పెట్టుకుంటే ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులను ఆదిపురుష్‌ చేరువయ్యే అవకాశం లేదు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

కనుక ఇప్పటి నుండే ప్రమోషన్ కార్యక్రమాలపై చిత్ర యూనిట్‌ సభ్యులు దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రూ.1000 కోట్ల కలెక్షన్స్ నమోదు అయితే తప్పితే ఆదిపురుష్‌ సినిమా కి బ్రేక్ ఈవెన్ సాధ్యమయ్యే పరిస్థితి లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరి అంత సాధ్యమేనా అనేది చూడాలంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు