కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించడం లేదు..: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించడం లేదని చెప్పారు.

ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అన్ని అంశాలపై చర్చించి సమయం వచ్చినప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు.అదేవిధంగా రేపు బీఏసీ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇందులోనే శాసనసభ సమావేశాల అజెండాపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Advertisement
చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు