తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్డీఏ( NDA ) కులమతాల మధ్య కావాలనే చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
మోదీ ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.హిందువుల ఓట్లు వస్తాయని మైనార్టీలను టార్గెట్ చేయడం సరికాదని చెప్పారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు తగ్గలేదని పేర్కొన్నారు.మోదీ విదేశాల నుంచి నల్లధనం తెస్తానని తేలేదని విమర్శించారు.
రిజర్వేషన్లపై మోదీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మోదీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అంతేకాకుండా బీజేపీ నేతలు దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.