ఎట్టకేలకు గెలిచి పరువు నిలుపుకున్న న్యూజిలాండ్‌

టీ20 సిరీస్‌ క్లీన్‌ స్వీప్‌ ఓటమిని భరించలేక పోతున్న న్యూజిలాండ్‌ టీం నేడు జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ప్రతాపం చూపించారు.

చాలా కసిగా ఆడి మొదటి మ్యాచ్‌ను గెలిపించుకున్నారు.

టీం ఇండియా భారీ లక్ష్యంను విధించినా కూడా న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్స్‌ పట్టుదలతో ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారు.వరుస విజయాలతో అంతర్జాతీయ సమాజం ముందు పరువు పోగొట్టుకున్న న్యూజిలాండ్‌ ఈ విజయంతో కాస్త కుదుట పడ్డట్లుగా చెప్పుకోవచ్చు.

ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాస్‌ టేలర్‌ అని చెప్పుకోవచ్చు.ఆయన చేసిన అజేయ సెంచరి మ్యాచ్‌కు విజయాన్ని కట్టబెట్టింది.

ఆయన నిలబడకుంటే ఖచ్చితంగా మ్యాచ్‌ ఇండియా వశం అయ్యింది.రాస్‌ టేలర్‌ సెంచరీ సాధించడంలో మన ఫీల్డర్ల తప్పిదాలు కూడా ఉన్నాయి.

Advertisement

ఆయన తక్కువ స్కోర్‌ వద్ద ఉన్న సమయంలో టీం ఇండియా ఆటగాళ్లు అతడు ఇచ్చిన క్యాచ్‌ను మిస్‌ చేశారు.దాంతో అతడు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్నాడు.

సెంచరి కొట్టి దేశం పరువు నిలిపాడు.ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో న్యూజిలాండ్‌ ముందంజలో ఉంది.

వన్డే సిరీస్‌ను ఇండియా గెలుచుకోవాలంటే మిగిలి ఉన్న రెండు మ్యాచ్‌లను కూడా గెలవాల్సిన పరిస్థితి.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు