టాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరక్టర్స్ లో ఒకరైన దేవి శ్రీ ప్రసాద్ అప్పుడప్పుడు తను ఇచ్చిన సాంగ్స్ గురించి నెగటివ్ కామెంట్స్ తెచ్చుకుంటాడు.లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుండి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ ట్యూన్ రామ్ హీరోగా వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా ట్యూన్ కి దగ్గరగా ఉంది.ఆడాళ్లు మీకు జోహార్లు సాంగ్ ట్యూన్ యాజిటీజ్ వాటమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా సాంగ్ ట్యూన్ ని దించేశారు
ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఆ ట్యూన్ ఈ ట్యూన్ ని మ్యాచ్ చేస్తూ దేవి శ్రీ కి ట్యాగ్ చేస్తున్నారు నెటిజెన్లు.
అంతేకాదు వాటమ్మా వాట్ ఈజ్ దిస్ అమ్మా దేవి శ్రీ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.మ్యూజిక్ డైరక్టర్స్ కి ఈ కాపీ ట్యూన్స్ ఎఫెక్ట్ బాగానే ఉంటుంది.
ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ కి కాపీ ట్యూన్ అంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేస్తారు.అయితే దేవి శ్రీ ప్రసాద్ తన ట్యూన్ ని తానే కాపీ కొడుతుంటాడు.
శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నారు.