ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థకు 'మహాసముద్రం' రైట్స్!

ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా మహాసముద్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరో సిద్దార్ధ్ కూడా నటిస్తున్నాడు.

చాలా రోజుల తర్వాత సిద్దార్థ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.అజయ్ భూపతి తో పాటు శర్వానంద్, సిద్ధార్థ్ కూడా ఈ సినిమా హిట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

అక్టోబర్ 14న దసరా సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.దీంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేస్తున్నారు.

Advertisement

అందులో భాగంగానే ఈ సినిమా నుండి ట్రైలర్ ను విడుదల చెయ్యగా ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా నిర్వహించారు.రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఇక ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటిటి సంస్థ సొంత చేసుకుంది.దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసింది.

మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్ని రోజులకు స్ట్రీమింగ్ అవుతుందో తెలియాల్సి ఉంది.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తుండగా.అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించారు.

Advertisement

చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు.మరి చూడాలి ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.

తాజా వార్తలు