కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన నయనతార.. ఏ హీరోయిన్ చెయ్యని విధంగా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మనందరికీ సుపరిచితమే.

ఈమె తన అందం, అభినయంతో టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది.

నయనతారకు కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉంది.ఇక తెలుగులో లక్ష్మీ, తులసి, యోగి లాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.

ఈమె,దర్శకుడు విఘ్నేష్ శివన్ ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే.గత కొంత కాలంగా ప్రేమించుకున్న ఈ జంట త్వరలోనే మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు.

ఇదిలా ఉంటే నయనతార ప్రస్తుతం ఒక సినిమా తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.అంతేకాకుండా వచ్చే కొన్నేళ్ల వరకూ ఆమె డేట్స్ ఖాళీగా లేవు.

Advertisement

ఎందుకంటే ఒకవైపు హీరోయిన్ గా బలమైన పాత్రలలో నటిస్తూనే, మరొకవైపు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉంది.నయనతార తన ప్రియుడు విఘ్నేష్ లు కలసి రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను స్థాపించారు.

ఈ బ్యానర్ లపై సినిమాలను కూడా నిర్మిస్తున్నారు.ఈ బ్యానర్ లో కూళంగల్ చిత్రాన్ని నిర్మించగా, ఆ చిత్రం భారత్ తరఫున అధికారికంగా ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకుంది.

అయితే గతంలో చెన్నైకి చెందిన ఛాయ్ వాలే బేవరేజ్ బ్రాండ్ లో నయనతార, విఘ్నేష్ కలిసి ఇన్వెస్ట్ చేశారు.ఇకపోతే తాజాగా నయనతార మరొక బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిందట.బ్యూటీ రిటైల్ బ్రాండ్ ను ఆమె లాంచ్ చేసింది.

డెర్మటాలజిస్ట్ అయిన రేణుక రాజన్ తో కలిసి ఆ బ్రాండ్ ను ప్రారంభించింది.ఆ బ్రాండ్ పేరు లిప్ బామ్ కంపెనీ.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఒకవైపు సినిమాలలో నటిస్తూ, మరొకవైపు నిర్మాతగా వ్యవహరిస్తూ, ఇంకొకవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది ఈ లేడీ సూపర్ స్టార్ నయనతార.

Advertisement

తాజా వార్తలు