అమరావతి రైతులకు భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) ఆ పార్టీ నేతలను ఎంతో కలవరానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు.

చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమహేంద్రవరం లోనే ఉంటున్నారు.చంద్రబాబు అరెస్టు తర్వాత రోజు నుండి కుటుంబ సభ్యులు అక్కడే ఉంటూ.

నిరసనలు చేపడుతూ మరో పక్క న్యాయపోరాటం చేస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా అమరావతి రైతులు( Amaravati Farmers ) రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరుని కలిసి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రైతులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది అని స్పష్టం చేశారు.రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం గురించి చంద్రబాబు ఎప్పుడు చెబుతుండే వారు.

Advertisement

ఎప్పటికైనా మీకు న్యాయం జరుగుతుంది అని అమరావతి రైతులకు భువనేశ్వరి ధైర్యం చెప్పారు.కచ్చితంగా చంద్రబాబు త్వరలో బయటకు వస్తారని స్పష్టం చేశారు.

మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం రాజధాని లేకుండా చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.అమరావతి రైతులు చేస్తున్న పోరాటం అంత తెలుసని అంతా ధైర్యంగా ఉండాలని చంద్రబాబు బయటకు వస్తారని మంచి రోజులు వస్తాయని రైతులందరికీ నారా భువనేశ్వరి ధైర్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు