బాధితులకు ఎల్వోసీ అందజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్లగొండ జిల్లా( Nalgonda District ):పేదలకు ఆపన్నహస్తం ముఖ్యమంత్రి సహాయనిధి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరశం ( Nakirekal MLA Vemula Veeresham )అన్నారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని పన్నాడగూడెం క్యాంప్ ఆఫీసులో మంగళవారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధిత కుటుంబానికి రూ.1,80,000 విలువ గల ఎల్ఓసి కాపీలను ఆయన అందజేశారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డుకు చెందిన ఎస్కే బీజాని కుమార్తె హసీనా.

 Nakirekal Mla Vemula Veeresham Handed Over The Lvc To The Victims , Nalgonda D-TeluguStop.com

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స నిమిత్తంహైదరాబాద్ లోని పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో జాయినై, సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసి కోసం తన దృష్టికి తీసుకురాగా వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధికి మంజూరుకు ఎల్ఓసి పంపినట్లు తెలిపారు.పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి ఎల్వోసీ ఉంటుందన్నారు.

బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు,ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి,యాసారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube