Naga Shaurya: అందరి ముందు వెధవ అయిపోతానేమో అని భయమేసింది.. దర్శకుడికి సారీ చెప్పి వెళ్లానంటూ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య( NagaShaurya ) గురించి మనందరికీ తెలిసిందే.

మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగ శౌర్య ఆ తర్వాత ఆ పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

చలో సినిమాతో ప్రేక్షకులతో మరింత చేరువయ్యాడు.ప్రస్తుతం అడపదడపా సినిమాలలో నటిస్తున్న నాగశౌర్య ఇటీవలె ఒక ఇంటి వాడైన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నాగశౌర్యకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.ఆ వివరాల్లోకి వెళితే.

పవన్ బాసంశెట్టి( Director Pawan Basamsetti ) దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగబలి.( Rangabali ) అయితే తనకున్న అనుభవంతో, మొదటి రోజు ఈజీగానే పని కానిచ్చేయొచ్చని భావించిన ఈ దర్శకుడికి, పవన్ చిన్నపాటి షాక్ ఇచ్చాడు.ఆ విషయాన్ని నాగశౌర్య బయటపెట్టాడు.

Advertisement

ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ. ఈ సినిమా షూటింగ్ మొదటి రోజు చాలా ఇబ్బంది పడ్డాను.

అది నేని నా లైఫ్ లో మరిచిపోలేను.మొదటి రోజే 6 పేజీల డైలాగ్ ఇచ్చాడు.

ఆ డైలాగ్ ను నా ఒరిజినల్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ లో చెప్పాలి.నా కళ్ల ముందే 10 టేక్స్ అయిపోయాయి.ఎప్పుడైతే 10 టేకులు దాటాయో నాకు మైండ్ బ్లాక్ అయింది,

సగం డైలాగ్స్ మరిచిపోయాను.20.30.40.50 టేకులయ్యాయి.డైరక్టర్ ప్యాకప్ చెబుతానన్నాడు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
10 గంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్.. ఈ నటుడి కష్టానికి ఫిదా అవ్వాల్సిందే!

అందరి ముందు వెధవ అయిపోతానేమో అని భయమేసింది.ఎలాగైనా చేయాలనుకున్నాను.

Advertisement

రాత్రి 8 అయింది.టేక్ ఓకే అవ్వలేదు.

ఈలోగా 5 పేజీల డైలాగ్స్ మరిచిపోయాను.దాంతో ఫస్ట్ డే తలదించుకొని, దర్శకుడికి సారీ చెప్పి వెళ్లిపోయాను అని చెప్పుకొచ్చారు నాగశౌర్య.

ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్ సెట్ అయిందని, అప్పట్నుంచి సినిమా పూర్తయ్యేవరకు ఎక్కడా బండి ఆగలేదని తెలిపారు.కాగా కేవలం నాగశౌర్యకి మాత్రమే కాకుండా దసరా సినిమా విషయంలో నానికి కూడా ఇలాంటి అనుభవం ఎదురయింది.

తాజా వార్తలు