నాగచైతన్య, సమంతలకు ఇల్లు ఇప్పించిన నాగార్జున?

అక్కినేని నాగచైతన్య ఇటీవల ఒక ఇంటి వాడు అయ్యాడు. బంజారా హిల్స్‌.

జూబ్లీ హిల్స్‌.మడికొండ ఏరియాల్లో ఎన్నో ఇల్లులు చూసిన నాగచైతన్య సమంతలకు ఏది కూడా నచ్చలేదు.

దాదాపు రెండు నెలలు పలు భవనాలను చూసిన వారికి నిరాశే మిగిలింది.ఆ సమయంలోనే ఒక ఇల్లు వారికి నచ్చింది.

కాని ఆ ఇల్లు మాత్రం అమ్మనన్నారట.తీరా ఆ ఇల్లు ప్రముఖ నటుడు మురళి మోహన్‌ది అని తెలిసింది.

Advertisement

బ్రోకర్‌ ద్వారా ఆ ఇల్లును అడిగితే నో చెప్పారట.

విషయం నాగార్జున వద్దకు వెళ్లడంతో స్వయంగా మురళి మోహన్‌కు ఫోన్‌ చేసి ఆ ఇల్లు చైతూకు నచ్చిందని అమ్మాలంటూ విజ్ఞప్తి చేశాడట.నాగార్జున విజ్ఞప్తి చేయడంతో గెస్ట్‌ హౌస్‌గా వాడుకుంటున్న ఆ ఇంటిని ఇచ్చేందుకు మురళి మోహన్‌ ఓకే చెప్పాడట.ఈ విషయం ప్రస్తుతం ఫిల్మ్‌ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

నాగార్జున మద్యరికం వ్యవహరించడం వల్లే ఆ మంచి ఇల్లు చైతూ సమంతలకు దొరికిందని అంటున్నారు.ప్రస్తుతం ఆ ఇంటికి తమకు కావాల్సిన మార్పులు చేర్పులు చేయించుకునే పనిలో ఈ అక్కినేని జంట ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.

అతి త్వరలోనే ఆ ఇంట్లోకి అధికారికంగా గృహప్రవేశం చేయాలని భావిస్తున్నారట.నాగచైతన్య, సమంతలు ఇప్పటి వరకు ఒక అపార్ట్‌ మెంట్‌లో ఉంటున్నారు.అది కూడా సొంతం అయినా కూడా ఒక ఇండిపెండెంట్‌ ఇల్లు కావాలనే ఉద్దేశ్యంతో ఆ ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?
Advertisement

తాజా వార్తలు