ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని హీరోనా.. డైరెక్టరా?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ లోకి ఎక్కువగా పోర్ట్ డిపార్ట్ మెంట్ వారు ఎంట్రీ ఇస్తున్నారు.

బ్రాండ్ అంబాసిడర్ గా సిల్వర్ స్క్రీన్ పై మెరిసే స్టార్లు డైరెక్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

మరీ ముఖ్యంగా అయితే ఇతర రంగాల వారు ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.మరీ ముఖ్యంగా అయితే స్పోర్ట్స్ రంగం నుంచి ఎక్కువ మంది సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇప్పటికే పలువురు స్పోర్ట్స్ పర్సన్స్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం మరికొంతమంది సినిమాల వైపు రావడానికి మొగ్గుచూపుతున్నారు.

అలాంటి వారిలో టీమ్ ఇండియా మాజీ సారథి స్టార్ క్రికెటర్ అయినా మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరు.ధోని కూడా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.

Advertisement

అయితే ధోనీకి ఉన్న పాపులారిటీ ఇమేజ్ కు తగ్గట్టుగానే హీరో గా ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు.కానీ ధోని మాత్రం అభిమానులను నిరాశపరుస్తూ నిర్మాతగా మాత్రమే ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

అది కూడా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం.

అయితే మొత్తానికి ధోని నిర్మాతగా కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇకపోతే ధోని నిర్మాతగా వ్యవహరించబోతున్న తొలి సినిమాకు హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది అని సమాచారం.

ధోని ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ద్వారా తమిళ అభిమానులు గణాన్ని పెంచుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పుడు సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆ అభిమాన బలగాన్ని మరింత పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

అయితే ధోనీ నిర్మాత, నయన తార లీడ్ రోల్ అయితే మరి డైరెక్టర్ ఎవరు అన్నదానిపైమాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు.

Advertisement

తాజా వార్తలు