ప్రాక్టీస్ మ్యాచ్ లో దంచికొట్టిన ధోని, రైనా..

ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం గా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్ లో మాత్రం అనూహ్యంగా చతికిలబడి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచింది.

ఇప్పటివరకు నిర్వహించిన ఐపీఎల్ ఈవెంట్స్ లలో మూడుసార్లు విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎనిమిది సార్లు రన్నరప్ గా నిలిచింది.

కానీ గత సీజన్ లో కేవలం ఆరు మ్యాచుల్లో గెలిచి.ఎనిమిది మ్యాచ్ లలో ఓడిపోయి సెమీఫైనల్స్ కూడా చేరుకోలేకపోయింది.

దీనితో ఐపీఎల్ ర్యాంకింగ్స్ పట్టికలో ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది.నిజానికి గత ఏడాది సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వలన ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్నారు.

దీనితో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్ లలో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.కానీ ఈసారి సురేష్ రైనా జట్టులోకి తిరిగి రావడంతో మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ బలంగా కనిపిస్తోంది.

Advertisement

ఈ ఐపీఎల్ సీజన్ తన స్నేహితుడు రైనా ప్రెజెన్స్ తో ఉత్సాహంగా ఉన్న ధోని బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ట్విటర్ అఫీషియల్ హ్యాండిల్ లో ఎంఎస్ ధోని సురేష్ రైనా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని షేర్ చేయగా.

ఈ వీడియోలో రైనా, ధోని ప్యాడ్స్ కట్టుకొని బ్యాట్ పట్టుకొని బంతుల్ని దంచికొట్టడం మనం చూడొచ్చు.అయితే ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇకపోతే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొత్తగా మొయిన్ అలీ, కృష్ణప్ప గౌత‌మ్ వంటి సమర్థవంతమైన ఆటగాళ్లు చేరారు.కానీ ఆస్ట్రేలియా పేస్ బౌల‌ర్ జోష్ హజిల్‌వుడ్ మాత్రం ఐపీఎల్‌ 14వ సీజ‌న్‌కు దూరం కానున్నారు.వరుసగా క్రికెట్ మ్యాచ్ లలో ఆడుతున్న ఆయన వీటన్నిటికీ బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సమయం గడపాలని ఈసారి ఐపీఎల్ కి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

కాగా మార్చి 10వ తేదీన ముంబై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనున్నది.మరి ధోని, రైనా తొలి మ్యాచ్ లో అద్భుతమైన ఆట ప్రదర్శన కనబరుస్తారో లేక గత సీజన్ లో నిరాశపరిచినట్లే సాధారణమైన ఆట ఆడతారో చూడాలి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు