పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ఎంపిపి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో( Telangana decade celebrations )భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం పై ఎంపీపీ పిల్లి రేణుక కిషన్( MPP Pilli Renuka Kishan) జాతీయ జెండా ఎగరవేశారు.

అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు కలిసి చేతి సంచులను అందజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దిశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే కరపత్రాలను వారు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి( Krishna Hari ), ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎంపీటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి పరిశ్రమలు గౌడ్ ,ఎలగందుల అనసూయ నరసింహులు, మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ , ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారు బాల్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,.

రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News