మరోసారి తెరపైకి పాత మర్డర్ కేసు.. ఈసారైనా నిజం బయటకొస్తుందా?

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్.రాంబాబు అనే పాత్రతో 2014లో దృశ్యం సినిమా లో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా లో శ్రీ ప్రియ దర్శకత్వం వహించగా దగ్గుబాటి సురేష్ బాబు, రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలుగా చేశారు.ఈ సినిమాలో మీనా, నదియా, నరేష్ లు నటించారు.

కాగా ఈ సినిమా మలయాళంలో 2013లో రీమేక్ గా రాగా.ఇందులో మోహన్ లాల్, మీనా, ఆశా శరత్, సిద్దిక్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.కన్నడం, హిందీ, చైనీస్ భాషలో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను సాధించుకుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమా మరోసారి తెరకెక్కనుంది.జీతు జోసఫ్ దర్శకత్వంలో మరోసారి దృశ్యం 2 గా తెరకెక్కనుంది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో.ఇటీవలే షూటింగ్ పూర్తయింది.

ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపి, అన్సిబా, ఎస్తేర్, సై కుమార్ ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.కాగా ఈ సినిమా ట్రైలర్ ను సినీ బృందం విడుదల చేయగా.

ప్రస్తుతం యూట్యూబ్ లో వైరల్ గా మారింది.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఈ చిత్ర బృందం తెలపగా.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

ఫిబ్రవరి 19 నుండి సోషల్ మీడియాలో వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది.

Advertisement

ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చూసినట్లయితే.పాత మర్డర్ కేసుకు సంబంధించిన విషయం గురించి మళ్ళీ మొదలవుతుంది అని అర్థమవుతుంది.కాగా ఇందులో మీనా ఎంతో అందంగా కనిపిస్తూ.

అదే కుటుంబం తో చూడ ముచ్చటగా కనిపిస్తుంది.మొత్తానికి ఈ సారి ఈ సినిమా మళ్లీ మొదటి కథతో తిరుగుతుందని అర్థమవుతుంది.

తాజా వార్తలు