టీపీసీసీ చీఫ్ పై ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రేగా కాంతారావు మండిపడ్డారు.తనపై పెట్టిన ఛార్జ్ షీట్ నిరూపించకపోతే లీగల్ గా ముందకు వెళ్తానని తెలిపారు.

తనకు మూడు వందల ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే పేదలకు పంచుతానన్నారు.అదేవిధంగా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.

తనపై చేసిన ఆరోపణలను రేవంత్ రెడ్డి నిరూపించలేకపోతే ముక్కు నేలకు రాయాలని సూచించారు.చట్ట సభలకు తనను రావొద్దని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఎవరని ఎమ్మెల్యే రేగా ప్రశ్నించారు.

ప్రజలే తమకు అల్టిమేటం అని తెలిపారు.

Advertisement
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

తాజా వార్తలు