వైసీపీలో కీలక నేత..టీడీపీలోకి..అచ్చెన్న షాకింగ్ కామెంట్స్

జగన్ రెడ్డి ఒక పక్క పాదయాత్రలు చేస్తూ.ప్రజలని ఆకట్టుకుంటూ.

పార్టీ టికెట్స్ ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నాడో వారి పేర్లు ప్రస్తావిస్తు.

కార్యకర్తలు.

నాయకుల్లో జోష్ పెంచుతూ పొలిటికల్ యాత్రకి మైలేజ్ తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు.మరోపక్క అధికార పార్టీ చేతులు ముడుచుకుని కూర్చోదు కదా అందుకే తన ప్రతాపం కూడా చూపిస్తోంది.

వైసీపి స్పీడు ఎంత పెరుగుతోందో అంతకంటే ఎక్కువగా తగ్గించే పనిలో భాగంగా కీలక నేతలని సైకిల్ ఎక్కిస్తోంది.టిడిపి ఈ పనిలో మాత్రం ఫుల్ సక్సెస్ అవుతోంది.

Advertisement

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి.వైసీపిలో ఉండే నాయకుల్ని తమ పర్తీవైపుకు తిప్పుకోవడానికి అధికార పక్షం పన్నని కుయుక్తులు లేవు సీనియర్ మంత్రి అచ్చెన్న ఈ మీడియా ముందు మాట్లాడుతూ వైసీపిలో ఒక కీలక వ్యక్తికోసం ప్రయత్నిస్తున్నాం.

ఆయన కనుక టిడిపిలో కి వచ్చేస్తే వైసీపి మాత్రం కాళీనే అంటూ మైండ్ గేమ్ మొదలు పెట్టారు.వైసీపిలో.

జగన్ పాదయాత్ర ముగిసే సమయానికి ఆ పార్టీలో కీలకనేతలు ఎవరూ లేకుండా చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు.వైసీపీలో ఇక జగన్.

ఆయన తల్లి.చెల్లి మాత్రమే మిగులుతారని.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచంటే ? 

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కనుక టీడీపీలో జంప్ చేస్తే వైసీపీ కి రాజ్యసభలో అభ్యర్థిని నిలిపే బలం కూడా ఉండే అవకాశం కోల్పోతుంది అని ఎద్దేవా చేశారు.ఇప్పుడు ఈ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే టిడిపి మాత్రం వచ్చే ఎన్నికలకి ఇప్పుడే భారీ స్కెచ్ వేసింది అనిపిస్తోంది.

Advertisement

ఇప్పుడు అచ్చెన్న చేసిన కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్.మరి ఆ కీలక నేత ఎవరు.

ఇంట్లో వ్యక్తా.బయట వ్యక్తా అనేది తేలాల్సి ఉంది.

ఏది ఏమైనా సరే రాజకీ హీట్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతుంది.

తాజా వార్తలు