భార్యపై కోపాన్ని అత్తపై చూపించిన అల్లుడు ... ఏం చేశాడంటే....?

ప్రస్తుతం కొందరు వ్యక్తులు క్షణికావేశానికి లోనై ఏకంగా మనషుల ప్రాణాలనే తీసేస్తున్నారు.

దీంతో తామ అనుకునే వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు  తాజాగా ఓ వ్యక్తి  తన భార్యతో పడినటువంటి గొడవ కారణంగా తన అత్త పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన టువంటి గ్రామంలో  వెంకటరమణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఈ మధ్య కాలంలో అతడి భార్యకి కొంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె తన భర్తతో కలిసి తన పుట్టింటికి వచ్చింది.

నిన్నటి రోజున రాత్రి భోజనం చేసిన తర్వాత వెంకటరమణ తన భార్యతో గొడవ పడ్డాడు.ఈ క్రమంలో భార్య తల్లి అయిన లక్ష్మమ్మ ఎందుకు అనవసరంగా తన కూతురుతో గొడవ పడుతున్నావ్ అంటూ వెంకటరమణ ని నిలదీసింది.

దీంతో మాట మాట పెరిగి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.ఈ గొడవ కారణంగా వెంకటరమణ తీవ్ర ఆగ్రహానికి గురై తన బైక్ లో ఉన్నటువంటి పెట్రోలు తీసుకొచ్చి లక్ష్మమ్మ పై పోసి నిప్పంటించాడు.

Advertisement

దీంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు వచ్చి మంటలను ఆర్పి ఆమెను దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు.అయితే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్ష్మమ్మ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు