ఎన్నికల ప్రచారంపై మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని తెలిపారు.
అదేవిధంగా రేపు పిఠాపురం నియోజకవర్గానికి వెళ్తున్నానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చిరంజీవి వెల్లడించారు.ప్రచారానికి రావాలని జనసేనాని పవన్ కల్యాణ్(Jana Senani, Pawan Kalyan )తనను పిలవలేదని చెప్పారు.
అయితే తన తమ్ముడు రాజకీయాల్లో ఎదగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.దివంగత నేత ఎన్టీఆర్ (NTR) భారతరత్నకు అన్ని రకాల అర్హుడన్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ దిశగా ఆలోచన చేయాలని ఆకాంక్షించారు.







