మనుషులా? పిశాచాలా?..టీడీపీపై సజ్జల సీరియస్..!!

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు(Chandrababu) అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.

 Humans? Ghosts?..sajjala Is Serious About Tdp, Tdp, Sajjala, Chandrababu, Sajjal-TeluguStop.com

ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై(Land Titling Act )దుష్ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు.చంద్రబాబు ప్రజలను భయపెడుతున్నారన్న ఆయన వీళ్లు అసలు మనుషులా.? లేక పిశాచాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.యాక్టుపై ప్రజలను భయపెట్టి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని మోదీ, అమిత్ షాతో(Modi, Amit Shah) చెప్పించాలన్నారు.గతంలో అసెంబ్లీలో యాక్టును ఆమోదించి, ఇప్పుడు వ్యతిరేకించి టీడీపీ(TDP) బుక్కయిందని విమర్శించారు.

ఈ – స్టాంపింగ్ విధానం చంద్రబాబు హయాంలోనే మొదలైందని చెప్పారు.అప్పుడే తెల్గీ స్టాంపుల కుంభకోణం జరిగిందన్న సజ్జల ఆ తరువాతే స్టాంపింగ్ విధానాన్ని కేంద్రం మార్చాలని నిర్ణయించిందని తెలిపారు.

అదేవిధంగా చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయలేడని తనకు తెలుసన్నారు.అందుకే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube