లూసీఫర్‌, వేదాళం.. మళ్లీ అటు ఇటు మార్పు?

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి తర్వాత ఏడాదికి రెండు మూడు సినిమా లను విడుదల చేయాలని భావించాడు.అందుకు తగ్గట్లుగా ప్లానింగ్‌ చేశారు.

కాని ఆయన ప్లాన్‌ తలకిందులు అయ్యింది.మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా గత ఏడాది ఆగస్టులో విడుదల అవ్వాల్సి ఉంది.

కాని ఇప్పటి వరకు సినిమా ను విడుదల చేసేందుకు సిద్దం కాలేదు.ఆచార్య సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చింది.

తదుపరి మూడు సినిమా లు కూడా లైన్ లో ఉన్నాయి.కాని అవి ఎప్పటికి ప్రారంభం అయ్యేది మాత్రం గందరగోళంగా ఉంది.

Advertisement

ఆచార్య పూర్తి అయిన వెంటనే మొదట వేదాళం రీమేక్ లో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత లూసీఫర్‌ రీమేక్ పట్టాలెక్కనుందని అన్నారు.

కాని మద్యలో లూసీఫర్‌ ను మొదట ఆ తర్వాత వేదాళం అంటూ మెగా కాంపౌండ్‌ నుండి అధికారికంగా సమాచారం అందింది.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ ఆచార్య తర్వాత వేదాళం ను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వేదాళం స్క్రిప్ట్‌ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యింది.లూసీఫర్ కూడా పూర్తి అయినా కూడా మళ్లీ దానిలో మార్పులు సూచించారట.

హీరోయిన్‌ ట్రాక్‌ ను అదనంగా యాడ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే లూసీఫర్ ను కాస్తా ఆలస్యంగా ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ సమయంలోనే వేదాళంను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు.ప్రస్తుతం లూసీఫర్‌ కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ తో పాటు వేదాళం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

మొత్తానికి వేదాళం రీమేక్ ను చిరంజీవి మొదట పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.అతి త్వరలోనే ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు