రుద్రంగి లో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

మేడే సందర్భంగా రుద్రంగి లోని ఇందిరాచౌక్ లో ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించిన కార్మికులు.

ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారీ రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కలరాస్తున్నాయని అన్నారు.కార్మికులకు భారంగా మరీనా నిత్యావసర ధరలను తగ్గించాలని అన్నారు.

స్థానికంగా ఉండే హమాలి కూలీలకు పని కలిపించడం మానేసి బీహార్ మహారాష్ట్ర కూలీలను తెప్పిస్తూ అధికారపార్టీ నాయకులు కార్మికుల పొట్ట కోడుతున్నారని అన్నారు.స్థానిక కార్మికులకె ముందు పని కల్పించాలని డిమాండ్ చేశారు.

కార్మికుల హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

Latest Rajanna Sircilla News