అనుష్కపై మనసు పడ్డ మణిరత్నం. ఆ పాత్ర కోసం స్వీటీపై ఆసక్తి

సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ అయిన పోన్నియన సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు.

భారీ తారాగణంతో, భారీ బడ్జెట్ తో ఈ సినిమాని మణిరత్నం ఆవిష్కరిస్తున్నారు.

టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.కార్తీ, జయంరవి, విక్రమ్, టాలీవుడ్‌ నుంచి మోహన్‌బాబు, మాలీవుడ్‌ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌ వంటి వారు నటించనున్నారు.

దీంతో సినిమా మీద అన్ని భాషలలో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాలో పూంగుళలి అనే పాత్ర కోసం అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ఆ పాత్ర కోసం మణిరత్నం బాహుబలి దేవసేన అనుష్క ని తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఇలాంటి పాత్రలలో రాణించి తనదైన ముద్ర వేసిన అనుష్క అయితే ఆ పాత్రకి కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని మణిరత్నం అనుష్కతో సంప్రదింపులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

Advertisement

ఇక అనుష్క ఈ సినిమాలో నటిస్తే సినిమాపై మరిన్ని హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 15 గురువారం, 2020
Advertisement

తాజా వార్తలు