అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన మహేష్.. ట్వీట్ వైరల్!

సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట.

ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది.

ఈ సినిమా గురించి కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసినప్పటికీ ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదలైన వారం రోజులలో వంద కోట్లను రాబట్టడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా సక్సెస్ పార్టీని ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా విజయోత్సవ వేడుకను కర్నూలులో ఘనంగా నిర్వహించారు.ఇకపోతే ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మహేష్ బాబు ఈ వేదికపై కృతజ్ఞతలు తెలిపిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా ఈ సినిమా విజయం గురించి ప్రస్తావిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

ఈ క్రమంలోనే మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.సర్కారు వారి పాట చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు.మీరంతా చూపిస్తున్న ప్రేమకు ఉప్పొంగి పోతున్నాను.

ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్న చిత్ర బృందానికి, అభిమానులకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించగా ఎస్.ఎస్ తమన్ సంగీత దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎం బీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.

కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?
Advertisement

తాజా వార్తలు