మహేష్‌ బాబును నమ్రత అక్కడకు తీసుకు వెళ్లబోతుందట

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరో.ఈయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

కాని మహేష్‌ బాబు తెలుగులో మాత్రమే సత్తా చాటుతున్నాడు.ఇతర భాషల్లో మాత్రం ఈయన పెద్దగా సత్తా చాటలేక పోతున్నాడు.

ప్రభాస్‌తో పాటు కొందరు తెలుగు హీరోలు హిందీ మరియు తమిళంతో పాటు ఇతర భాషల్లో మంచి ఆధరణ పొందుతున్నారు.కాని మహేష్‌బాబు మాత్రం ఎప్పుడు ఇతర భాషల్లో నిరాశే పొందుతున్నారు.

బాలీవుడ్‌లో తెలుగు స్టార్‌కు ఆధరణ ఎక్కువగా ఉంది.ఆ కారణంగా నమ్రత ఆదిశగా ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

  బాహుబలి, సాహో వంటి సినిమాలు బాలీవుడ్‌లో భారీ వసూళ్లను సాధించాయి.అందుకే తనకున్న పరిచయాలతో తన భర్త మహేష్‌ కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరును హిందీలో డబ్‌ చేసి అక్కడ భారీగా విడుదల చేయాలని ప్రయత్నిస్తుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు చర్చలు కూడా ఆమె చేస్తోంది.

హిందీలో సైరా చిత్రం కూడా అక్టోబర్‌ 2న విడుదల కాబోతుంది.తెలుగు సినిమాలకు ఈమద్య హిందీలో మంచి ఆధరణ దక్కుతుంది.

అందుకే తప్పకుండా సరిలేరు నీకెవ్వరు చిత్రంకు సక్సెస్‌ దక్కే అవకాశం ఎక్కువ ఉంది.

  బాలీవుడ్‌లో ఒక్కసారి ఫేమ్‌ సంపాదించుకుంటే తర్వాత తర్వాత సినిమాలకు మంచి ఆధరణ దక్కడం ఖాయం.బాహుబలి చిత్రం సూపర్‌ హిట్‌ అవ్వడం వల్ల సాహో చిత్రం యావరేజ్‌గా ఆడినా కూడా ఏకంగా 200 కోట్ల వసూళ్లను అక్కడ నమోదు చేసింది.అందుకే మహేష్‌ బాబుతో కూడా హిందీలో ప్రయత్నాలు చేయించాలని, ప్రయత్నిస్తే పోయేది ఏముందని నమ్రత భావిస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

సరిలేరు నీకెవ్వరు చిత్రంను హిందీలో భారీ ఎత్తున విడుదల చేయడం ద్వారా అక్కడ మంచి వసూళ్లను నమ్రత ఆశిస్తుంది.బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరగా ఉండేలా ఈ చిత్రంను తీయాలని అనీల్‌ రావిపూడితో నమ్రత చెబుతోంది.

Advertisement

మరి మహేష్‌ బాలీవుడ్‌ జర్నీ ఎలా సాగేనో చూడాలి.

తాజా వార్తలు